బీడీ పరిశ్రమ బతికి బట్టకట్టాలంటే బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. మండలిలో ఆయన మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడి పది లక్షల మంది కార్మికులు బతుకుతున్నారన్నారు. బీడీపై జీఎస్టీ తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.